కోడేరు మండలం పున్నమి ప్రతినిధి జులై 20 నాగులపల్లి తండాలో సర్పంచ్ రాములు నాయక్ అధ్యక్షతన రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ అధికారిణి (ఏఓ) నవ్య భారతి మాట్లాడుతూ.. రైతులు దొడ్డు రకం వరి పంటను వేసుకోవద్దని, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు లాభదాయక పంటలను ఎంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండా రైతులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


