కొల్లాపూర్ మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం డీఆర్డీఓ చిన్న ఓబులేష్ పర్యటించారు. ఇక్కడి గుట్టలపై ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న ఖండిత కందకాల పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కందకాల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని, నేల కోతను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్రావు, టెక్నికల్ అసిస్టెంట్ మధు కుమార్ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు





