కొత్తపల్లి గ్రామంలోని UGD డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలి…
కొత్తపల్లి గ్రామంలో గత నెల మెన్ రోడ్డు UGD పనులు ప్రారంభించడం జరిగింది కాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని వార్డు సభ్యులు తెలిపారు.పనులు ఆలస్యం కారణంగా రాకపోకలకు ఇబ్బంది అవుతుందని మధ్యాహ్నం ఆమనగల్ వెల్లే బస్సు,రాత్రి దొడ్లపాడు వెల్లే బస్సు రాకపోవడం వల్ల తండా వాసులు,గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు,రైతులు పొలాలకి వెళ్లిరవడానికి,అత్యవసర సేవలు అందక,వెళ్లడానికి గ్రామం నుండి మరొక్క పెద్ద రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుందని,ఇండ్ల ముందు పోవడానికి కూడా వీలు లేకుండా నెలల తరబడి గుంతలు తీసి పెట్టారు,పెద్దవాళ్లు,చిన్న పిల్లలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉందన్నారు.ఇంజనీర్ ఏఈ కూడా పరిస్థితులను గమనించి కాంటాక్ట్ తో మాట్లాడి ఈవారంలో డ్రైనేజీ పనులు తొందరగా పూర్తి చేయాలని వారితో మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాలే.అనిత,వార్డు సభ్యులు వంగ.సంజీవ రెడ్డి,కంబాలపల్లి. కుమార్,మహేశ్వరం.వినోద, పోలే.శివ కుమార్, అరవింద్ గ్రామస్థులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.






