కుండపోతగా కురుస్తున్న వానలవల్ల బీహార్ రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల పలు జిల్లాల్లో దాదాపు 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. పాట్నాలో ఆస్పత్రులు, మెడికల్ స్టోర్లు, ఆస్పత్రులు నడుం లోతు నీళ్లలో మునిగిపోయాయి.నగరంలో అన్ని వైద్య సదుపాయాలున్న అతిపెద్ద నలందా మెడికల్ కాలేజి ఆస్పత్రి కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన ఫోటోషూట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిట్) స్టూడెంట్ అదితి సింగ్.. వరదల్లోనే ఫొటోషూట్ చేయించుకుంది. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో ‘మెర్మైడ్ ఇన్ డిజాస్టర్-పాట్నాలో వరద సమయంలో పరిస్థితి’ అనే టైటిల్ తో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆ యువతిని ఆడేసుకుంటున్నారు. ఈ ఫొటోషూట్ కాస్త క్రియేటివ్గా ఉందని… వర్షం, వరదలు వస్తే ఆమె తప్పేముంది? ఆమె నిట్ స్టూడెంట్ కాబట్టి తన క్రియేటివిటీని చూపించిందని కొందరు ఆ యువతికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ప్రజలు సమస్యల్ని చెప్పే విధానం ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొంప కాలి ఒకడు ఏడుస్తుంటే .చుట్టూ కాల్చు కున్నాడు ఒకడు. ఈ అమ్మాయి యవ్వారం అట్టా ఉంది
కుండపోతగా కురుస్తున్న వానలవల్ల బీహార్ రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల పలు జిల్లాల్లో దాదాపు 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. పాట్నాలో ఆస్పత్రులు, మెడికల్ స్టోర్లు, ఆస్పత్రులు నడుం లోతు నీళ్లలో మునిగిపోయాయి.నగరంలో అన్ని వైద్య సదుపాయాలున్న అతిపెద్ద నలందా మెడికల్ కాలేజి ఆస్పత్రి కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన ఫోటోషూట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిట్) స్టూడెంట్ అదితి సింగ్.. వరదల్లోనే ఫొటోషూట్ చేయించుకుంది. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో ‘మెర్మైడ్ ఇన్ డిజాస్టర్-పాట్నాలో వరద సమయంలో పరిస్థితి’ అనే టైటిల్ తో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆ యువతిని ఆడేసుకుంటున్నారు. ఈ ఫొటోషూట్ కాస్త క్రియేటివ్గా ఉందని… వర్షం, వరదలు వస్తే ఆమె తప్పేముంది? ఆమె నిట్ స్టూడెంట్ కాబట్టి తన క్రియేటివిటీని చూపించిందని కొందరు ఆ యువతికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ప్రజలు సమస్యల్ని చెప్పే విధానం ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.