నెల్లూరు లో అప్నారాజు గా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రఖ్యాతి పొందిన కావలి ప్రాంతానికి చెందిన బుట్టి నాగరాజు ని ఆర్యవైశ్య రాష్ట్ర నేత టి.జి.వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి లో గురువారం ప్రారంభించిన వాసవి నిలయం గృహ ప్రవేశం కార్యక్రమం లో ఈ భవనానికి ఇంజనీరింగ్ సేవలు అందించిన నాగరాజు ఆయన తనయుడు హైదరాబాద్ లో ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ రాజా గౌతమ్ లను వెంకటేష్ వైశ్య నేతలు దేవకి వెంకటేశ్వర్లు,శిద్దా నాగేశ్వరరావు, ఇల్లూరు లక్ష్మయ్య లతో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. భవన సముదాయం కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం లో అందరికి అనువుగా రూపొందించడంలో నాగరాజు టీం చేసిన కృషి అమోఘం అని కొనియాడారు. నాగరాజు కి వాసవి నిలయం తరపున ప్రత్యేక మెమెంటో అందచేశారు.


