పలమనేరు, జులై 3,2020(పున్నమి విలేకరి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు పరిచి కనీస వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్ టి యు, అంగన్వాడి పలమనేర్ డివిజన్ కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు.అందులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మదనపల్లి రోడ్డు నందుగల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రోజురోజుకు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఇప్పటికీ వెట్టి చాకిరి చేస్తూ కనీస వేతనాలు లేకుండా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా ఐసిడిఎస్ ప్రారంభం నచేశారుప్రజలకు ఎన్నో కష్టాలు పడి సేవలు అందించామని అటువంటి వారిపై ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు పెత్తనం చలాయిస్తున్నారని, ప్రభుత్వం అటువంటి ఆలోచనలు విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి.
పలమనేరు, జులై 3,2020(పున్నమి విలేకరి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు పరిచి కనీస వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్ టి యు, అంగన్వాడి పలమనేర్ డివిజన్ కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు.అందులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మదనపల్లి రోడ్డు నందుగల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రోజురోజుకు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఇప్పటికీ వెట్టి చాకిరి చేస్తూ కనీస వేతనాలు లేకుండా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా ఐసిడిఎస్ ప్రారంభం నచేశారుప్రజలకు ఎన్నో కష్టాలు పడి సేవలు అందించామని అటువంటి వారిపై ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు పెత్తనం చలాయిస్తున్నారని, ప్రభుత్వం అటువంటి ఆలోచనలు విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వాలకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.