“మధ్యవర్తిత్వం ముద్దు.. వాజ్యం వద్దు” — సీనియర్ సివిల్ జడ్జి విజయ
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
: యలమంచిలి కోర్టు సముదాయంలో మధ్యవర్తిత్వంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అవగాహనతో వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని, సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి విజయ వివరించారు. కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ కూడా నిర్వహించారు.

