ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో హరి ఓమ్ కు ఘనంగా నివాళులు
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు గొల్లపల్లి వినయ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మసూద్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రగతి నగర్ పద్మజ హాస్పిటల్ వద్ద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రాయోబరేలి లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ గారి వీరాభిమాని అయిన హరి ఓమ్ ను కొందరు మతోన్మాదులు మూక హత్య చేయడాన్ని నిరసిస్తూ హరి ఓమ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని నివాళులర్పించి మాట్లాడుతూ
దళిత యువకుడైన హరియోంను మూకదాడిలో చంపి హత్య చేసిన కేసులో NSUI దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి న్యాయం కోసం పోరాడుతుంది. యోగి ఆదిత్యనాథ్ పాలనలో బహుజనుల హత్యలను ఇక సహించబోము.
రాయ్బరేలిలో హరియోమ్ మూక హత్య మానవాళిని సిగ్గుపడేలా చేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ పేరును వాడుకుంటున్నప్పుడు, చెడ్డ వ్యక్తులు “మేము బాబా నుండి వచ్చాము” అని అంటున్నారు. ఇది యోగి రాజ్ యొక్క నిజమైన ముఖం.
న్యాయం చేయడానికి బదులుగా, యుపి పోలీసులు నిందితులపై ‘ఉద్దేశపూర్వకంగా హత్య’ నేరాన్ని మోపారు, తద్వారా హంతకులు కొన్ని రోజుల్లో బయటకు వస్తారు.
ఈ జాతి ఆధారిత హింస మరియు ద్వేషపూరిత నమూనాలను మేము అమలు చేయనివ్వము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హరియోమ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు షఫిక్ అహ్మద్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడిగెల ప్రదీప్ పిట్టల బాలరాజ్ మహమ్మద్ జలీల్ అలీమ్ శరత్ రాఘవ వరుణ్ కాసిఫ్ దిలీప్ శివ కిరణ్ రిజ్వాన్ అభినవ్ కార్తీక్ వరుణ్ తేజ్ మణికంఠ సుభాష్ మల్లికార్జున్ చింటూ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు…


