*ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ గ్రేటర్ జనగామ మరియు లక్ష్మీ గణపతి అన్న ప్రసాద వితరణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం 6:30 కు ఉచిత విత్తన మట్టి వినాయక విగ్రహాల (1500) పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ హాజరైనారు, వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద గత 15 సంవత్సరాల నుండి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపడుతున్నామని అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే మీ ఇంట్లో మేము ఇచ్చిన విత్తన మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రులు పూజలు జరిపించుకొని మీ పెరట్లో నిమజ్జనం చేసినట్లయితే అందులో నుంచి పలము గానీ పుష్పం గానీ వస్తుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రాయోజకులుగా పెద్ది శ్రీనివాస్, బెల్దే శ్రీధర్, రామిని శ్రీనివాస్ అదే విధంగా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బిజిగం బిక్షపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య గౌరవ అధ్యక్షులు పజ్జూరి గోపయ్య రీజియన్ చైర్మన్ పడకంటి రవీందర్, గట్టు రాధా కృష్ణ, బుస్సా లింగమూర్తి, బెల్దే రాములు తదితరులు పాల్గొన్నారు*



