నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల వద్ద సుమారు 500 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి యువరాజ్ IAS శనివారం మధ్యాహ్నం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.







