అన్నవరంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం
జలదంకి: పున్నమి ప్రతినిధి | 09-09-2026
జలదంకి మండలం అన్నవరం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, మండల క్లస్టర్ ఇన్చార్జి పూనూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల విశ్వాసం, ధర్మం, న్యాయం చివరకు గెలుపును సాధిస్తాయనే సందేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు

అన్నవరంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం
అన్నవరంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం జలదంకి: పున్నమి ప్రతినిధి | 09-09-2026 జలదంకి మండలం అన్నవరం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, మండల క్లస్టర్ ఇన్చార్జి పూనూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల విశ్వాసం, ధర్మం, న్యాయం చివరకు గెలుపును సాధిస్తాయనే సందేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు

