సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్ మల్లేపుల సత్యనారాయణ, డైరెక్టర్ షేక్ యూసుఫ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు గోవర్దన్, నరేష్, మున్సిఫ్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్ లకు సన్మానం
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్ మల్లేపుల సత్యనారాయణ, డైరెక్టర్ షేక్ యూసుఫ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ నాయకులు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు గోవర్దన్, నరేష్, మున్సిఫ్ తదితరులు పాల్గొన్నారు.

