Tuesday, 14 April 2026
  • Home  
  • సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ మార్గమే దారి- జనసైనికులు
- తిరుపతి

సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ మార్గమే దారి- జనసైనికులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలో పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఘననివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత పోరాటం ఆయన ఆశయాలను జనసైనికులు స్మరించుకుటూ… చిన్న వయసులోనే అనేక కష్టాలను ఎదుర్కొని, కుల వివక్షతను అనుభవిస్తూ కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్న అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, కుల వివక్ష లేని సమాజం నిర్మాణమే ఆయన లక్ష్యమని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని, ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ పనిచేస్తుండటం గర్వకారణమని తెలిపారు. ఇదే ఏప్రిల్ 14 తేదీన 28 సంవత్సరాల క్రితం స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని స్మరించారు. అదే తేదీన ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహం వద్ద సుందర వాతావరణం ఏర్పడటం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బందికి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తిలో పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో ఘననివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత పోరాటం ఆయన ఆశయాలను జనసైనికులు స్మరించుకుటూ… చిన్న వయసులోనే అనేక కష్టాలను ఎదుర్కొని, కుల వివక్షతను అనుభవిస్తూ కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్న అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, కుల వివక్ష లేని సమాజం నిర్మాణమే ఆయన లక్ష్యమని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసే దిశగా కృషి చేయాలని, ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ పనిచేస్తుండటం గర్వకారణమని తెలిపారు. ఇదే ఏప్రిల్ 14 తేదీన 28 సంవత్సరాల క్రితం స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని స్మరించారు. అదే తేదీన ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహం వద్ద సుందర వాతావరణం ఏర్పడటం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బందికి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.