తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలంలోని శివనాథపురంలో వున్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సృష్టిలో అంతులేని అనురాగాన్ని కరుణను కురిపించేది కేవలం అమ్మ మాత్రమేనని, అలాంటి మాతృమూర్తి సేవలకు ప్రతిరూపం ‘అమ్మ ఆశ్రమం’ అని గత 25 ఏళ్లుగా నిరంతర కృషితో, సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు భూలక్ష్మి మేడమ్ సేవలను అభినందిస్తూ ఆమెను ఘనంగా దుశ్శాలువాతో సత్కరించారు. అమ్మ ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదని, అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఈ ఆశ్రమం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు రత్నం రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కంట ఉదయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆశ్రమ సేవలను కొనియాడారు.

సేవకు నిలువెత్తు రూపం ‘అమ్మ ఆశ్రమం’-25 ఏళ్ల ప్రస్థానంపై ఎమ్మెల్సీ ప్రశంసలు
తొట్టంబేడు, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) తొట్టంబేడు మండలంలోని శివనాథపురంలో వున్న ‘అమ్మ ఆశ్రమం’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సృష్టిలో అంతులేని అనురాగాన్ని కరుణను కురిపించేది కేవలం అమ్మ మాత్రమేనని, అలాంటి మాతృమూర్తి సేవలకు ప్రతిరూపం ‘అమ్మ ఆశ్రమం’ అని గత 25 ఏళ్లుగా నిరంతర కృషితో, సేవా దృక్పథంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు భూలక్ష్మి మేడమ్ సేవలను అభినందిస్తూ ఆమెను ఘనంగా దుశ్శాలువాతో సత్కరించారు. అమ్మ ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదని, అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఈ ఆశ్రమం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు రత్నం రెడ్డి, శివారెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కంట ఉదయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆశ్రమ సేవలను కొనియాడారు.

