స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 14: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో గణనాథుడి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి ప్రతిష్టించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు తొలి పూజలు నిర్వహించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.



