శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో గురువారం ఉదయం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్వయంగా చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని, బంగారు కడ్డీతో బియ్యంపై ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. పవిత్రమైన గురు దక్షిణామూర్తి సన్నిధిలో చిన్నారులకు తొలిసారి అక్షర రూపం నేర్పించే భాగ్యం కలగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యా స్వరూపుడైన ఆ పరమశివుని ఆశీస్సులతో నియోజకవర్గంలోని పిల్లలందరూ చదువుల్లో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి బిడ్డ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శివాలయంలో సామూహిక అక్షరాభ్యాసం-చిన్నారులకు ఓనమాలు దిద్దించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో గురువారం ఉదయం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్వయంగా చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని, బంగారు కడ్డీతో బియ్యంపై ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. పవిత్రమైన గురు దక్షిణామూర్తి సన్నిధిలో చిన్నారులకు తొలిసారి అక్షర రూపం నేర్పించే భాగ్యం కలగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యా స్వరూపుడైన ఆ పరమశివుని ఆశీస్సులతో నియోజకవర్గంలోని పిల్లలందరూ చదువుల్లో రాణించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి బిడ్డ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

