ఖమ్మం: భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఖమ్మం జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన శుభసందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యారంగంలో భారతదేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపడుతోందని ఆచంటి కోటేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా పున్నమి దినపత్రిక యాజమాన్యానికి, పాఠకులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలని, యువత విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.



