తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 21:
ఆషాఢ మాస వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా పంచమి–అష్టమి పర్వదినాన కొవ్వూరులోని శ్రీ వారాహి మాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు (సూరపనేని చిన్ని) పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల కోరికలను నెరవేర్చే దైవంగా ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొంటూ, అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపను పొందాలని పిలుపునిచ్చారు.

వారాహి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 21: ఆషాఢ మాస వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా పంచమి–అష్టమి పర్వదినాన కొవ్వూరులోని శ్రీ వారాహి మాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు (సూరపనేని చిన్ని) పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల కోరికలను నెరవేర్చే దైవంగా ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొంటూ, అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపను పొందాలని పిలుపునిచ్చారు.

