బద్రాద్రి కొత్తగూడెం. జూలై. 30. (పున్నమి. వార్తలు)TG: క్యూఆర్ కోడ్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1.05 కోట్ల కుటుంబాలకు వీటిని అందించనుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ పూర్తవ్వగా.. అన్ని జిల్లాలకు పంపించారు. ఆగస్టు 1 లేదా 15 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్లు సమచారం. ఈ స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఫొటో ఉంటుంది. అయితే జులై 31లోగా ఈకేవైసీ పూర్తి చేయనివారికి ఇవి నిలిపివేయనున్నట్లు
తెలుస్తోంది



