ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 2 (పున్నమి ప్రతినిధి)
మలేరియా జ్వరంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మొహసీన్ సుల్తానా సూచించారు. సోమవారం మనుబోలు ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ, జూన్ 1 నుంచి 31 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మలేరియా నివారణ చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా జ్వరం వచ్చినప్పుడు వణుకుతో కూడిన జ్వరం వస్తుందని, అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు.

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి
ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 2 (పున్నమి ప్రతినిధి) మలేరియా జ్వరంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మొహసీన్ సుల్తానా సూచించారు. సోమవారం మనుబోలు ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ, జూన్ 1 నుంచి 31 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మలేరియా నివారణ చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా జ్వరం వచ్చినప్పుడు వణుకుతో కూడిన జ్వరం వస్తుందని, అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు.

