భర్త కళ్లెదుటే బైక్పై నుంచి పడి భార్య మృతి
ఏలూరు జిల్లా పోలవరం మండలం సెప్టెంబర్ 8
నల్లజర్ల , పోలవరం పాతూరు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది.
ద్విచక్రవాహనంపై భర్తతో కలిసి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలవ్వడంతో భార్య లక్ష్మి (38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి


