పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సువేందు అధికారి తొలిసారిగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ భేటీలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో “సబ్కా సాథ్, సబ్కా వికాస్” విజన్పై చర్చించినట్లు సువేందు అధికారి తెలిపారు. బెంగాల్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ప్రాధాన్యత అని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర అభివృద్ధి మందగించిందని, ఇప్పుడు పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం, గతంలో ఆమె పశ్చిమ బెంగాల్ పర్యటనలో జరిగిన వివాదాలను గుర్తుచేసుకుంటూ కొత్త ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ పర్యటనతో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు మరింత బలపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


