ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయంలో శివపార్వతులను తేరు మీద ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించారు. సుమారు 25 టన్నుల తేరును భక్తులు భుజాలపై మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి తీసుకెళ్లారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. శివనామస్మరణతో ప్రాంతం మార్మోగింది. భద్రత కోసం ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి రథోత్సవం భక్తి వైభవంగా నిర్వహణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డులో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయంలో శివపార్వతులను తేరు మీద ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించారు. సుమారు 25 టన్నుల తేరును భక్తులు భుజాలపై మోసుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి తీసుకెళ్లారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. శివనామస్మరణతో ప్రాంతం మార్మోగింది. భద్రత కోసం ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

