రంగారెడ్డిలో రగిలిపోతున్న ఎండలు… 40°C దాటిన ఉష్ణోగ్రతలు – హీట్ అలర్ట్ జారీ!”
అగ్గి రాజ్యంగా రంగారెడ్డి జిల్లా… 40°C దాటిన ఉష్ణోగ్రతలు బయటకు అడుగు వేస్తే జాగ్రత్త!”
పున్నమి న్యూస్ ప్రతినిధి
14 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ :
రంగారెడ్డి జిల్లాలో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం కష్టంగా మారింది. రోడ్లపై వేడి గాలులు వీచడంతో జనజీవనం స్థంభించింది.
ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, బయటకు వెళ్లేటప్పుడు తలకు రక్షణ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఇక రైతులు, కార్మికులు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. పనులు మధ్యలోనే ఆపివేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు కూడా హీట్ వేవ్పై అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
*ప్రజలకు సూచనలు* :
మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకండి
తగినంత నీరు, పానీయాలు తీసుకోండి
తలకు టోపీ లేదా గుడ్డ కప్పుకోండి
పిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోండి
హీట్ అలర్ట్… జాగ్రత్తగా ఉండండి – ప్రాణాలను కాపాడుకోండి!



