ఖమ్మం, మే 12
(పున్నమి జిల్లా ఇంచార్జి)
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ఖమ్మంలో స్థానిక పాత బస్ స్టాండ్ దగ్గర నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని 500 మంది ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. మండుటెండల్లో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి బాలయ్య అభిమాన సంఘం నాయకుడు నల్లమల్ల రంజిత్ ని , అలాగే పాల్గొన్న ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు నందమూరి బాలయ్య అభిమానులు
మధు, తారక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.



