కుబీర్ మండలం,చోండి గ్రామం సెప్టెంబర్ 07 ( పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చోండి గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్యభాన్ క్రాంతి రాజ్ కిరణ్, ఉప సర్పంచ్ మట్టు రాణి రవికుమార్ పాల్గొన్నారు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో రేషన్ డీలర్ శ్రీనివాస్ గ్రామ కారోబారి దత్తురామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


