కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్లో బోధనకు అవకాశం
—————————————————–
విశాఖపట్నం జిల్లా,భీమునిపట్నం, ఆగస్టు 9 (పున్నమి ప్రతినిధి):
భీమునిపట్నంలోని ఎస్వీఎల్ఎన్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బోధించేందుకు అర్హత కలిగిన అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ తెలిపారు.
కళాశాలలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
⭐ అర్హతలు ఇవే..
సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండటంతో పాటు NET / SET / Ph.D అర్హతల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
📅 ఆగస్టు 12న ఇంటర్వ్యూ
అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు తమ అసలు అర్హత ధ్రువపత్రాలు, సంబంధిత సర్టిఫికెట్లతో ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు కళాశాలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు.
📞 మరిన్ని వివరాలకు సంప్రదించండి
9294001665 | 9848632130
👉 అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి బోధనా అవకాశం — ఆసక్తిగల వారు గడువులోగా హాజరుకావాలి.


