Wednesday, 5 August 2026
  • Home  
  • ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం కీలకం: జిల్లా కలెక్టర్ అంకిత్
- భద్రాద్రి కొత్తగూడెం

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం కీలకం: జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)-2026 సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 99.31 శాతం పురోగతి జిల్లాలో మొత్తం 9,96,198 మంది ఓటర్లలో ఇప్పటివరకు 8,60,051 ఎన్యూమరేషన్ ఫారాలు (86.33%) డిజిటైజ్ అయ్యాయని, 1,29,263 ఫారాలు (12.98%) అన్-కలెక్టబుల్గా నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. దీంతో మొత్తం 9,89,314 ఫారాల ప్రక్రియ పూర్తై 99.31 శాతం పురోగతి సాధించగా, ప్రస్తుతం 6,884 ఫారాలు (0.69%) మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఓటర్ల వివరాల ధృవీకరణపై దృష్టి మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ల వివరాలు ముసాయిదా ఓటరు జాబితాలో చేరతాయని, ఆన్‌మ్యాప్డ్ కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను సంబంధిత ఆధారాలతో ఎన్నికల అధికారులకు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సూచనలు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా కొత్త భవనాలను ప్రతిపాదించాలని, 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలు లేదా జనాభా పెరిగిన ప్రాంతాలను రేషనలైజేషన్ కోసం సూచించాలని అన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటిపై విచారణ అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)-2026 సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గడువు పొడిగించిన నేపథ్యంలో మిగిలిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.

జిల్లాలో 99.31 శాతం పురోగతి

జిల్లాలో మొత్తం 9,96,198 మంది ఓటర్లలో ఇప్పటివరకు 8,60,051 ఎన్యూమరేషన్ ఫారాలు (86.33%) డిజిటైజ్ అయ్యాయని, 1,29,263 ఫారాలు (12.98%) అన్-కలెక్టబుల్గా నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. దీంతో మొత్తం 9,89,314 ఫారాల ప్రక్రియ పూర్తై 99.31 శాతం పురోగతి సాధించగా, ప్రస్తుతం 6,884 ఫారాలు (0.69%) మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

ఓటర్ల వివరాల ధృవీకరణపై దృష్టి

మ్యాపింగ్ పూర్తయిన ఓటర్ల వివరాలు ముసాయిదా ఓటరు జాబితాలో చేరతాయని, ఆన్‌మ్యాప్డ్ కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను సంబంధిత ఆధారాలతో ఎన్నికల అధికారులకు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సూచనలు

పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా కొత్త భవనాలను ప్రతిపాదించాలని, 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలు లేదా జనాభా పెరిగిన ప్రాంతాలను రేషనలైజేషన్ కోసం సూచించాలని అన్నారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం

జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటిపై విచారణ అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.