Wednesday, 15 April 2026
  • Home  
  • పూలే సేవలు చిరస్మరణీయం.. శ్రీకాళహస్తిలో భాజపా నివాళులు
- తిరుపతి

పూలే సేవలు చిరస్మరణీయం.. శ్రీకాళహస్తిలో భాజపా నివాళులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ మాట్లాడుతూ, 1827లో మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక సంస్కర్త, విద్యావేత్తగా దేశానికి అపార సేవలు అందించారని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించిన మహనీయుడని పేర్కొన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలే, సమాజంలో సమానత్వ భావనను వ్యాప్తి చేసిన చిరస్మరణీయ వ్యక్తిగా కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1888లో “మహాత్మా” బిరుదు ప్రదానం చేయబడిందని వివరించారు. ‘గులాం గిరి’, ‘రైతు వాగ్దానం’ వంటి రచనల ద్వారా సామాజిక అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, జీవీ అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడు గాదెపాకుల యతీష్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ మాట్లాడుతూ, 1827లో మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక సంస్కర్త, విద్యావేత్తగా దేశానికి అపార సేవలు అందించారని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించిన మహనీయుడని పేర్కొన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలే, సమాజంలో సమానత్వ భావనను వ్యాప్తి చేసిన చిరస్మరణీయ వ్యక్తిగా కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1888లో “మహాత్మా” బిరుదు ప్రదానం చేయబడిందని వివరించారు. ‘గులాం గిరి’, ‘రైతు వాగ్దానం’ వంటి రచనల ద్వారా సామాజిక అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, జీవీ అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడు గాదెపాకుల యతీష్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.