ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు రాజు గారు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడాలని, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటా ప్రచారం చేయాలని, అత్యవసరమైన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాయకులు కార్యకర్తలు సమన్వయంతో భేషజాలు లేకుండా ముందుకు వెళ్లాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు గారు, ఉందుర్తి మహర్షి గారు, గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



