ఖమ్మం / నిజామాబాద్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతినగర్కు చెందిన ఏఆర్ ఎస్సై సతీష్ మృతి చెందారు. 2009లో ఏఆర్ విభాగంలో నియమితులైన ఆయన ప్రస్తుతం నిజామాబాద్లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. సతీష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అధికారుల ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతికి అసలు కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.



