తాళాలు తొలగించి.. రూ.13.50 లక్షలు చోరీ!
కుంట్లూర్ భూదాన్ జయప్రకాష్నగర్లో ఘటన.. ఇద్దరు దొంగల కదలికలు సీసీ కెమెరాలో రికార్డు
హయత్నగర్, సెప్టెంబర్ 11: హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ భూదాన్ జయప్రకాష్నగర్లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఓ ఇంటికి వేసిన తాళాలను తొలగించి ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి భారీ మొత్తంలో నగదును అపహరించినట్లు సమాచారం. ఇంట్లో భద్రపరిచిన రూ.13 లక్షల 50 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళాలను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తుల కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. చోరీ అనంతరం నిందితులు అక్కడి నుంచి నగదుతో పరారైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Uploaded Video:



