ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 29 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పూడిపర్తి జెడ్పీ హైస్కూలుకు చెందిన విద్యార్థులు కె. జస్వంత్ (591), కె. చందన (589), కె. సుశ్వాని (587) పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందారు. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబాల నుంచి వచ్చి ప్రతిభ కనబర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కూడా ఆయన అభినందించారు.

ట్రిపుల్ ఐటీకి ఎంపికైన పూడిపర్తి విద్యార్థులకు సోమిరెడ్డి అభినందనలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 29 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పూడిపర్తి జెడ్పీ హైస్కూలుకు చెందిన విద్యార్థులు కె. జస్వంత్ (591), కె. చందన (589), కె. సుశ్వాని (587) పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందారు. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబాల నుంచి వచ్చి ప్రతిభ కనబర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కూడా ఆయన అభినందించారు.

