ఖమ్మం ఆగష్టు 10
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం: హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భూక్యా శ్యాం సుందర్ నాయక్, వేల్పుల సుధాకర్, అల్లిక అంజయ్య, శ్రీరామనేని మణి, బోయినపల్లి సురేష్, వాకాదాని రామకృష్ణ, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

