ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి
గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు.
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతిక విప్లవానికి నాంది అని ఆయన కొనియాడారు. రాజీవ్ గాంధీ చేసిన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన కోరారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారని ఆయన అన్నారు. ఆయన ఆశయాలు ఎల్లప్పుడు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు నిమ్మల నాగేశ్వరరావు, ఒక్కంతుల సాగర్, కూరాకుల కోటేశ్వరరావు, శేషయ్య, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

