శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి బాలకృష్ణయ్య సోదరుడు గుమ్మడి వెంకటయ్య ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి విషయమై సమాచారం అందుకున్న వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శనివారం వెంకటయ్య పార్థివ దేహాన్ని సందర్శించారు. వెంకటయ్య భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీవారి సురేష్, కుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు.

గుమ్మడి వెంకటయ్య మృతికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నివాళి
శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి బాలకృష్ణయ్య సోదరుడు గుమ్మడి వెంకటయ్య ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి విషయమై సమాచారం అందుకున్న వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శనివారం వెంకటయ్య పార్థివ దేహాన్ని సందర్శించారు. వెంకటయ్య భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీవారి సురేష్, కుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు.

