ఎర్పేడు, మే 15 (పున్నమి న్యూస్): ఎర్పేడు మండలంలోని క్రిష్ణంపల్లి గ్రామంలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న వీధి రోడ్డు సమస్య పరిష్కార దిశగా అడుగులు పడాయి. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, పున్నారావు, రాఘవేంద్ర గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి క్షేత్రస్థాయిలో చర్చలు నిర్వహించిన నాయకులు, రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులపై అవగాహన కల్పించారు. అందరికీ అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు అంగీకారం తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, టైలర్ చంద్ర, హరి, వెంకటసుబ్బరెడ్డి, కేశినేని సుబ్రమణ్యం, కేకే రమణ, గుణా యాదవ్, రాచాటి సుబ్రమణ్యం, వై మనోహర్ నాయుడు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

క్రిష్ణంపల్లిలో వీధి రోడ్డు సమస్యకు పరిష్కారం
ఎర్పేడు, మే 15 (పున్నమి న్యూస్): ఎర్పేడు మండలంలోని క్రిష్ణంపల్లి గ్రామంలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న వీధి రోడ్డు సమస్య పరిష్కార దిశగా అడుగులు పడాయి. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, పున్నారావు, రాఘవేంద్ర గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి క్షేత్రస్థాయిలో చర్చలు నిర్వహించిన నాయకులు, రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులపై అవగాహన కల్పించారు. అందరికీ అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు అంగీకారం తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, టైలర్ చంద్ర, హరి, వెంకటసుబ్బరెడ్డి, కేశినేని సుబ్రమణ్యం, కేకే రమణ, గుణా యాదవ్, రాచాటి సుబ్రమణ్యం, వై మనోహర్ నాయుడు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

