ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 4 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో మన్నెమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “రెండేళ్ల నమ్మకం… అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కొమ్మలపూడిలో 20 కుటుంబాలు టీడీపీలో చేరిక
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 4 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో మన్నెమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “రెండేళ్ల నమ్మకం… అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

