కొత్తవలస మేజర్ పంచాయతీలో పూర్తిస్థాయి సానిటరీ ఇన్స్పెక్టర్ ని నియమించాలని వినతి
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 17. ( పున్నమి ప్రతినిధి )
కొత్తవలస మేజర్ పంచాయతీలో చాలా సంవత్సరాల నుండి సానిటరీ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ ఆవనందున మేజర్ పంచాయతీలో పనులు నత్త నడకన సాగుతూ ఉన్నాయని అలాగే హోటల్స్ గాని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇష్టారాజ్యంగా ఫుడ్ ను తయారు చేసి ప్రజలు ఆరోగ్యంతో చలగాటలాడుతున్నారని దీని మూలంగా ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని వీటిపై ఇంత వరకు ఆహార తయారీ నాణ్యతపై అధికారులు చర్యలు తీసుకోలేదని, ఏ విధమైన దాడులు గాని పరిరక్షణ గాని జరగలేదని ఇకపై పర్యవేక్షణ చేసి ప్రజల మన్నాలను పొందాలని ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు బోని అచ్యుత రమణ పత్రికా పరంగా తెలియజేశారు

