Saturday, 19 September 2026
  • Home  
  • కలిగిరి: పిడుగుపాటుకు వ్యక్తి మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కలిగిరి మండలం దూబగుంటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దూబగుంట ఎస్టీ కాలనీకి చెందిన తలపల రామారావు (50) శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో వర్షం కురుస్తుండటంతో సమీపంలోని ఓ పాకలోకి వెళ్లి వర్షం నుంచి తలదాచుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడటంతో రామారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటు ధాటికి ఆయన శరీరం కాలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కలిగిరి మండలం దూబగుంటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దూబగుంట ఎస్టీ కాలనీకి చెందిన తలపల రామారావు (50) శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో వర్షం కురుస్తుండటంతో సమీపంలోని ఓ పాకలోకి వెళ్లి వర్షం నుంచి తలదాచుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడటంతో రామారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పిడుగుపాటు ధాటికి ఆయన శరీరం కాలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.