కడప వాసి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ రెడ్డిని ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో గౌరవించిన సందర్భంగా కడపలో ఆగస్టు 9, 2026న అభినందన సభ నిర్వహించనున్నట్లు భారతీయ హిందూ ఐక్యవేదిక అధ్యక్షుడు విజయానందరెడ్డి, హిందూ ధర్మం టెంపుల్స్ ప్రేయర్ సొసైటీ వ్యవస్థాపకుడు సోము కళానాధ రెడ్డి, బ్రాహ్మణ పురోహిత సమాఖ్య రాష్ట్ర కోశాధికారి శ్రీధర్ శర్మ తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సినీ నటుడు శివకృష్ణ, సభాధ్యక్షుడిగా మూల మల్లికార్జునరెడ్డి, ప్రత్యేక అతిథులుగా వైఎస్ఆర్ ఆర్చిటెక్చర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి జయరామిరెడ్డి, ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్, గౌరవ అతిథులుగా డాక్టర్ పుత్తా బాలిరెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సునీల్ దత్తు, పారిశ్రామికవేత్త రాజోలు వీరారెడ్డి పాల్గొంటారని తెలిపారు.





