Thursday, 17 September 2026
  • Home  
  • ఎస్సీ కమిటీ హాల్ శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎస్సీ కమిటీ హాల్ శంకుస్థాపన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు

ఎస్సీ సోదరుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన. ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, సెప్టెంబర్ 16: రెడ్డిగూడెం ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల వాంఛ నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి చొరవతో రెడ్డిగూడెంలోని సీఎస్ఐ చర్చి సమీపంలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వసంత. ఎస్సీ సోదర సోదరీమణులకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్వయంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం కార్యరూపం దాల్చడంతో స్థానిక ఎస్సీ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది. అనేక సామాజిక కార్యక్రమాలకు ఉపయోగకరం. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే రెడ్డిగూడెం ఎస్సీ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఈ భవనం అందుబాటులో ఉండనుంది. స్థానికుల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు సూచించారు. నాణ్యతలో రాజీ వద్దు.. సకాలంలో పూర్తి చేయాలి. కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ సామగ్రిని వినియోగించాలని, పనులను వేగవంతం చేసి సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యం. రెడ్డిగూడెం గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు స్థానికుల కృతజ్ఞతలు. ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల కోరికను గుర్తించి రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు సమకూర్చి, పనులకు శంకుస్థాపన చేయడంపై స్థానికులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమకు అవసరమైన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్న

ఎస్సీ సోదరుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన.

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, సెప్టెంబర్ 16:

రెడ్డిగూడెం ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల వాంఛ నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి చొరవతో రెడ్డిగూడెంలోని సీఎస్ఐ చర్చి సమీపంలో డి.ఎం.ఎఫ్ నిధులు రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వసంత.

ఎస్సీ సోదర సోదరీమణులకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్వయంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం కార్యరూపం దాల్చడంతో స్థానిక ఎస్సీ కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది.

అనేక సామాజిక కార్యక్రమాలకు ఉపయోగకరం.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే రెడ్డిగూడెం ఎస్సీ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఈ భవనం అందుబాటులో ఉండనుంది. స్థానికుల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు సూచించారు.

నాణ్యతలో రాజీ వద్దు.. సకాలంలో పూర్తి చేయాలి.

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ సామగ్రిని వినియోగించాలని, పనులను వేగవంతం చేసి సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యం.

రెడ్డిగూడెం గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేకు స్థానికుల కృతజ్ఞతలు.

ఎస్సీ సోదర సోదరీమణుల చిరకాల కోరికను గుర్తించి రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు సమకూర్చి, పనులకు శంకుస్థాపన చేయడంపై స్థానికులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమకు అవసరమైన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్న

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.