పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పి మహేష్ బి గీతే పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు విఘ్నేశ్వరుడు అందరికీ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని సూచించారు



