Saturday, 19 September 2026
  • Home  
  • ఎస్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : అరకు ఎంఈఓ-1
- అల్లూరి సీతారామరాజు

ఎస్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలి : అరకు ఎంఈఓ-1

అరకులోయ మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సన్నద్ధం కావాలని ఎంఈఓ వి.త్రినాథరావు సూచించారు. గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ఎన్నికల నిర్వహణపై సన్నద్ధత శిక్షణ ఇచ్చారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అదేరోజు నూతనంగా ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్మన్‌ ప్రమాణ స్వీకారం, తొలి సమావేశం నిర్వహించాలన్నారు. సెప్టెంబర్‌ 18న పాఠశాల నోటీసు బోర్డులో ఓటర్ల జాబితా ప్రదర్శించి, 25న అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు టీ.మోహన్‌రావు, పద్మావతి, ఏటీడబ్ల్యూఓ రమణ, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

అరకులోయ మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సన్నద్ధం కావాలని ఎంఈఓ వి.త్రినాథరావు సూచించారు. గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ఎన్నికల నిర్వహణపై సన్నద్ధత శిక్షణ ఇచ్చారు. సెప్టెంబర్‌ 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అదేరోజు నూతనంగా ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్మన్‌ ప్రమాణ స్వీకారం, తొలి సమావేశం నిర్వహించాలన్నారు. సెప్టెంబర్‌ 18న పాఠశాల నోటీసు బోర్డులో ఓటర్ల జాబితా ప్రదర్శించి, 25న అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు టీ.మోహన్‌రావు, పద్మావతి, ఏటీడబ్ల్యూఓ రమణ, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.