అరకులోయ మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ లో జరిగిన వేడుకలలో అరకు ఎంపీ డా గుమ్మా తనూజ రాణి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రంజపల్లి ఉషారాణి, పెదలబుడు పంచాయితీ కార్యాలయంలో అరకులోయ ఎంపీడీఓ, పంచాయితీ ప్రత్యేక అధికారి వీసం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ సభ్యులు దురియ ఆనంద్ కుమార్, లబుడుబారి భీమరాజు, స్థానిక నాయకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రాలు, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.



