ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
శాసనసభలో తమ నాయకురాలికి జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలనతో పాటు అన్ని ప్రజా సమస్యలపై సభలో నిలదీస్తామన్నారు. చర్చల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం చిల్లర డ్రామాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసులు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమాధానాలు రాబడతామని కేటీఆర్ పేర్కొన్నారు.


