బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు దారుణం: తలసాని
అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని, మహిళా ఎమ్మెల్యేలతోనూ అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్కు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.


