క్షమాపణ చెబుతారనుకున్నా: స్పీకర్
నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని భావించానని స్పీకర్ వ్యాఖ్యానించారు. హరీశ్రావుకు మైక్ ఇచ్చింది కూడా క్షమాపణ చెబుతారనే ఉద్దేశంతోనని తెలిపారు. అయితే అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తాను స్పీకర్గా అన్ని వైపులా చూస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నానన్నారు. కడియం శ్రీహరిని ప్యానెల్ స్పీకర్గా పెడుతున్నట్లు చెప్పారు. గతంలో సబితా ఇంద్రారెడ్డితో రాజకీయంగా విభేదాలున్నా ఇలాంటి పరిస్థితులు రాలేదన్నారు.


