నేరరహిత సమాజమే లక్ష్యం: జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS
నెల్లూరు, ఆగస్టు 13: నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, IPS ఆదేశాలతో, అడిషనల్ ఎస్పీ CH. సౌజన్య సూచనల మేరకు జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, మహిళలు–బాలల రక్షణ, సైబర్ నేరాలు, చిట్ఫండ్స్, అక్రమ పెట్టుబడి పథకాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై డయల్-112 లేదా ఈగల్ టోల్ఫ్రీ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


