ఉర్దూ పాఠశాల అభివృద్ధి: దేవరకొండ సుజాత,
47వ డివిజన్ జండావీధిలో వాటర్ట్యాంక్, ఉర్దూ పాఠశాల ప్రాంగణాలను మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేటర్ రామకృష్ణ పరిశీలించారు. పాఠశాల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి డాక్టర్ పి. నారాయణ దృష్టికి సమస్యలను తీసుకెళ్తామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అండర్గ్రౌండ్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో రోడ్లను త్వరగా మరమ్మతు చేస్తామని తెలిపారు.


